వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాస్తవ గమ్యం: జులై 26.సిర్పూర్(యు) మండలం జీర్లఘాట్ గ్రామంలో నిర్వహించిన కీ॥శే॥ శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, ఆదివాసీ సమాజాన్ని ఆధ్యాత్మిక చైతన్యంతో ముందుకు నడిపించిన మహనీయుడు శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ అని కొనియాడారు. ఆయన బోధనలు ఆదివాసీ సమాజంలో ఐక్యత, నైతిక విలువలు, ఆధ్యాత్మిక భావజాలాన్ని పెంపొందించాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆత్రం శంకర్,స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం