వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సేకరిస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల వివరాలను బీఎల్వో యాప్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 21, 15 వార్డుల్లో జరుగుతున్న ఇంటింటి ఎన్యుమరేషన్ ప్రక్రియను తహసీల్దార్ సతీష్ కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 24 వరకు కొనసాగే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఓటర్లకు ఫారాలు అందించిన వెంటనే బీఎల్వో యాప్లో నమోదు చేసి, నింపిన ఫారాలను తిరిగి సేకరించిన తర్వాత వివరాలను యాప్లో ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. మరణించిన వారు, గ్రామం విడిచి వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ ఎపిక్ కార్డులు కలిగిన వారి వివరాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి ఓటరికి ఒకే ఓటరు గుర్తింపు కార్డు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Reporter
వాస్తవ గమ్యం