వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ అధికారులు భీమారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాస రచన మరియు చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు.అలాగే ఇందులో భాగంగా విద్యార్థులకు అడవి లో పులులు ఉండడం వలన కలిగే లాభాలు,పర్యావరణ సమతుల్యత అవి లేకపోతే కలిగే నష్టాలు గూర్చి అవగాహన కల్పించారు. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు మరియు పాల్గొన్న అందరు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఓ జి .సుధాకర్,భీమారం మరియు ఇతర అటవీ శాఖ సిబ్బంది అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం