వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెన)లో.పేదలకు ప్రాణం పోసే దేవాలయాలుగా వర్ధిల్లాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు.. బాధ్యతారాహిత్యానికి నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా రెబ్బన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు వైద్యం అందించే కేంద్రంలా కాకుండా, బర్త్డే వేడుకలు జరుపుకునే 'కేక్ కటింగ్' పాయింట్గా మారిపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.ఆసుపత్రి వెలుపల రోగులు నరకయాతన అనుభవిస్తూ వైద్యం కోసం గంటల తరబడి వేచి చూస్తుంటే, లోపల ఉండాల్సిన సిబ్బంది మాత్రం బర్త్డే కేకుల ముందు 'బిజీబిజీ'గా గడిపారు. రోగుల ప్రాణాల కంటే తమ వ్యక్తిగత వేడుకలే ముఖ్యమన్నట్లుగా సిబ్బంది ప్రవర్తించారు. ఒకరికొకరు కేకులు తినిపించుకుంటూ, కేరింతలు కొడుతూ హుషారుగా కనిపించడం అక్కడికి వచ్చిన వారిని విస్మయానికి గురిచేసింది. అత్యవసర వైద్య సేవలు అందించే పరికరాల మధ్యే ఈ 'కేక్ కటింగ్' పండగ జరగడం సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది.విధి నిర్వహణలో అత్యంత బాధ్యతాయుతంగా ఉండాల్సిన వైద్య సిబ్బంది, ఇలాంటి తీపి పనులతో కాలక్షేపం చేస్తే ఇక మా ప్రాణాలకు గ్యారెంటీ ఏంటి? అని రోగులు, వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిని పార్టీ హాలుగా మార్చేసిన ఈ 'వైద్య' వీరులపై ఉన్నతాధికారులు ఎలాంటి 'చేదు' చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Reporter
వాస్తవ గమ్యం