వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో పాత పోలీస్ స్టేషన్ను గ్రంథాలయంగా మార్పు చేసి యువతకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ గ్రంథాలయాన్ని రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. గ్రామీణ యువతకు చదువు వాతావరణం కల్పించి పోటీ పరీక్షలకు సహకరించడమే లక్ష్యమని తెలిపారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షల పుస్తకాలు, ప్రస్తుత వ్యవహారాల మెటీరియల్, వ్యక్తిత్వ వికాస గ్రంథాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా పోలీసులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం