వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మంగళవారం జైపూర్ పోలీస్ స్టేషన్లో ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర నుంచి పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్పోస్టుల వద్ద నిఘా పెంచాలని,నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మతపరమైన ఉద్రిక్తతలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, మావోయిస్టుల కదలికలపై నిరంతరం సమాచారాన్ని పంచుకోవాలని సూచించారు. అలాగే నకిలీ విత్తనాలు, ధాన్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, సిరోంచా ఎస్డీపీవో సందేశ్ నాయక్ మరియు పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు
Admin
వాస్తవ గమ్యం