వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల్ సిపిఐ కార్యాలయం లో మంగళవారం సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం భీమనాదుని సుదర్శన్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక సంక్షోభాలు ,మన రాష్ట్రంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు కార్మికులు రైతులు విద్యార్థులు యువకులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులపై మూడు రోజులపాటు మంచిర్యాల జిల్లా కేంద్రo లో నిర్వహించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ రాజకీయ శిక్షణ తరగతులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం కునంనేని సాంబశివరావు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, మూడు రోజులపాటు జరిగే రాజకీ శిక్షణ తరగతులు బోధించేందుకు సంబంధిత అధ్యాపకులు హాజరవుతారు వివరించారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, కలిందర్ అలీ ఖాన్, జోగుల మల్లయ్య,ఇప్పకాయల లింగయ్య,మిట్టపల్లి శ్రీనివాస్,లింగం రవి, దాగం మల్లేష్ లు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం