వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : నిజామాబాద్ డివిజన్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డిని అకారణంగా, పరుష పదజాలంతో దూషించిన ఆబ్కారీ శాఖ కమిషనర్పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్ స్పందిస్తూ.30 ఏళ్లుగా శాఖకు విశేష సేవలందించిన ఉత్తమ అధికారి సోమిరెడ్డిని "వెధవ, ఇడియట్" అంటూ అవమానించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలాంటి అన్ పార్లమెంటరీ భాషను వాడుతూ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఈ ఘటనపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించాలని కోరారు.ఈ నిరసనకు మంచిర్యాల జిల్లా నుండి జేఏసీ ప్రతినిధులు ఆలం పోచయ్య, ప్రహ్లాద్ ఆత్రం (టీజీరస జనరల్ సెక్రటరీ) పూర్తి మద్దతు ప్రకటిస్తూ, బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Admin
వాస్తవ గమ్యం