వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : సిరిసిల్ల: నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నిరసనగా,"ఛాత్రోం కీ గూంజ్" పేరిట యువజన కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో నాయకులు సిరిసిల్ల బ్రిడ్జిపై బైఠాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా కౌడగాని వెంకటేష్ మాట్లాడుతూ.నీట్ లీకేజీ వల్ల మనస్తాపంతో 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ ప్రభుత్వం తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 80కి పైగా పేపర్లు లీక్ అయ్యాయని, కేంద్ర మంత్రి రాజీనామా చేయకుంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధులు గుడిసె ప్రభాకర్, రెడ్డిమల్ల భాను, నియోజకవర్గ అధ్యక్షులు చుక్క రాజశేఖర్, న్యాత నవీన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగం మురళి, శేఖర్ శౌర్య నాయక్, ఎడ్ల తిరుపతి మరియు పలువురు మండల, టౌన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం