వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వడగళ్ల వర్షం పట్టణాన్ని ముంచెత్తింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం:పాలవాగు సమీపంలో ఈదురుగాలుల ధాటికి ఒక భారీ వృక్షం విరిగి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై పడింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగి పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంది.చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పోలీసులు మరియు మున్సిపల్ సిబ్బంది చెట్టును తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చెయ్యాలి ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని లేదా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Admin
వాస్తవ గమ్యం