వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లోని డిస్పెన్సరీ ని మంగళవారం సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ నేపథ్యంలో డిస్పెన్సరి లో సింగరేణి ఉద్యోగులకు మరియు కార్మికులకు అందిస్తున్న వైద్య విధానాలు,వైద్య. సదుపాయాలు, మందులు,పరీక్షల గురించి అక్కడి డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు.చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. సింగరేణి ఎస్టిపిపి ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా ప్రభావిత గ్రామాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాల పట్ల సంతృప్తి గా ఉందని,ప్లాంట్ ప్రభావిత గ్రామాల ప్రజలు ఈ ఉచిత సేవలను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్యులు, వైద్య సిబ్బంది అన్ని వేళలా రోగులకు అందుబాటులో ఉండాలని,అత్యవసర పరిస్థితులలో అవసరమగు మందులను, సామాగ్రిలను అందుబాటులో ఉండేలా తప్పకుండా చూసుకోవాలని ఆదేశించారు.డిస్పెన్సరిలో సింగరేణి ఉద్యోగులకు,కాంట్రాక్టు కార్మికులకు నిర్ణిత సమయానికి చేసే పీరియడికాల్ మెడికల్ ఎక్షామినేషన్ వంటి వైద్య పరిక్షలకు ఇతర ఏరియా హాస్పిటల్స్ కు వెళ్ళకుండా ఇక్కడనే అన్ని వైద్య పరిక్షలు నిర్వహించేలా చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వారి వెంట డిస్పెన్సరి మెడికల్ సూపరింటెండెంట్ డా.జానకి,సీనియర్ స్టాఫ్ నర్స్ రాజమణి,వార్డ్ అసిస్టెంట్ లు రాజు,తిరుపతి,ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం