వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం: మండలంలోని చిర్రకుంట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ మహిళా సమాఖ్య భవనాన్ని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, సెర్ప్, మేప్మా ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు, ముద్ర రుణాలు అందిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థిక సాధికారత కోసం కృషి చేస్తున్నాయని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుళ్ల మంగ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కాండే అనిల్, డీఆర్డీఓ దత్తారావు, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరిగెల నాగేశ్వర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లిఖార్జున్, కోవా విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం