వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టిజిఆర్టిసి జెఎసి సమ్మె నేపథ్యంలో జిల్లాలో బస్సు సర్వీసులు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున ప్రైవేట్ హైర్డ్, ఔట్సోర్సింగ్, తాత్కాలిక డ్రైవర్లకు పూర్తి పోలీస్ రక్షణ కల్పిస్తామని ఎస్పీ నితిక పంత్ స్పష్టం చేశారు.డ్రైవర్లు ఎలాంటి భయానికి గురికావాల్సిన అవసరం లేదని, వారి భద్రత కోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ముఖ్య కూడళ్లు, బస్స్టాండ్లు, సున్నిత ప్రాంతాల్లో పోలీస్ బలగాలను మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే స్పందించేందుకు మొబైల్ పెట్రోలింగ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.బస్సు సర్వీసులకు అడ్డుకట్ట వేయడం, డ్రైవర్లను బెదిరించడం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Admin
వాస్తవ గమ్యం