వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం నాయకపుగూడ గ్రామ పంచాయతీలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సార్) కార్యక్రమాన్ని సర్పంచ్ ఎదుల సుమలత–శ్రీనివాస్, ఉపసర్పంచ్ పవన్ నంద ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా బీఎల్ఓ మమతతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే వారు, మార్పులు–చేర్పులు చేసుకోవాల్సిన వారు, వివరాలు సరిచేసుకోవాల్సిన అర్హుల నుంచి అవసరమైన సార్ ఫారమ్లను సేకరించారు. ఓటరు జాబితా పూర్తిగా, ఖచ్చితంగా ఉండేందుకు ప్రతి అర్హులైన ఓటరు సకాలంలో తమ వివరాలను సమర్పించాలని సర్పంచ్ ఎదుల సుమలత కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం