వాస్తవ గమ్యం / తెలంగాణ / వరంగల్ : మంత్రి కొండా సురేఖ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. సురేఖకు అధిష్ఠానం నుంచి బలమైన మద్దతు లభిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులతో పాటు ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులు, పీసీసీ ముఖ్య నేత ఆమెకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది.సురేఖపై చర్యలు తీసుకుంటే బీసీ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందన్న అంచనాతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సురేఖకు పెరుగుతున్న మద్దతుతో సీఎం క్యాంపులో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగినట్లు సమాచారం.
Reporter
వాస్తవ గమ్యం