Tuesday, 28 July 2026 03:26:37 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

నిబంధనలు గాలికి అధికారుల ఇష్టారాజ్యం ​భూ నిర్వాసితుల పొట్టకొడుతున్న టెండర్ల దందా

​మందమర్రిలో నిబంధనలను తుంగలో తొక్కిన అధికారులు!

Date : 17 April 2026 07:37 PM Views : 386

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​మందమర్రి,సింగరేణి ఏరియాలో భూములను నమ్ముకుని యాజమాన్యానికి అప్పగించిన భూ నిర్వాసితుల పట్ల అధికారులు మొండి వైఖరి అవలంబిస్తున్నారు.టెండర్ షెడ్యూల్‌లో ఉన్న నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సింది పోయి,వాటిని తుంగలో తొక్కి తమకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిబంధనలను తమకు అనుగుణంగా మార్చుకుంటూ అటు నిర్వాసితులను, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో హైర్ వెహికల్స్(అద్దె వాహనాల)కోసం యాజమాన్యం భూ నిర్వాసితుల నుండి టెండర్లను ఆహ్వానించింది. ఆ ప్రక్రియలో భాగంగా, ఒక వాహనంపై ఓనర్‌తో పాటు మరో ఇద్దరికి టెండర్ తీయడం జరిగింది. నిబంధనల ప్రకారం.మొదటి వ్యక్తి వెహికల్ ఒప్పందాన్ని పొందగా, రెండో మరియు మూడో లబ్ధిదారులు వెయిటింగ్ లిస్ట్'లో కొనసాగాల్సి ఉంటుంది.అంటే, భవిష్యత్తులో అదే స్థానంలో వాహనం అవసరమైతే, మళ్లీ టెండర్ పిలవకుండానే వరుస క్రమంలో ఉన్న రెండో వ్యక్తికి అవకాశం ఇవ్వాలి.కానీ, ప్రస్తుతం అధికారులు ఆ పాత నిబంధనలను పక్కన పెట్టేసి, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి కాకుండా మళ్లీ కొత్తగా టెండర్లు పిలవడం పలు అనుమానాలకు తావిస్తోంది.అప్పటి నిబంధనలు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి ఇది అధికారుల ఉత్సాహమా లేక కావాలని ఎవరికైనా లబ్ధి చేకూర్చేందుకు చేస్తున్న కుట్రలా అని లబ్ధిదారులు నేరుగా అధికారులనే నిలదీస్తున్నారు.ఇప్పటికే మందమర్రిలో సెక్యూరిటీ టెండర్ల విషయంలో జరిగిన గందరగోళం వల్ల సుమారు 200 మందికి పైగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇప్పుడు అదే పంథాలో భూ నిర్వాసితుల వాహన టెండర్ల నిబంధనలు మార్చడం పట్ల స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. యాజమాన్యం నమ్మి భూమి ఇచ్చినందుకు తమకు ఇదా ప్రతిఫలం అని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.టెండర్ షెడ్యూల్‌లో ఉన్న నిబంధనలను యథావిధిగా అమలు చేయాలి. ​వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న భూ నిర్వాసితులకు వెంటనే న్యాయం చేసి, వారికి అవకాశం కల్పించాలి. ​పక్షపాత వైఖరి వీడి, పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహించాలి. ​అధికారులు ఇప్పటికైనా స్పందించి, భూ నిర్వాసితుల ఆవేదనను గుర్తించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :