వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల్, జులై 4: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో రానున్న 10–15 సంవత్సరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, కొత్త బొగ్గు గనుల వేలంలో చురుకుగా పాల్గొని కొత్త బ్లాకులను సాధించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ,బొగ్గు ఉత్పత్తి పెంపుతో పాటు కోల్ గ్యాసిఫికేషన్ రంగంలోనూ సింగరేణి అడుగులు వేయాలని అన్నారు.సంస్థ వాస్తవ పరిస్థితులను ఉద్యోగులకు పారదర్శకంగా వివరించి, భవిష్యత్ సవాళ్లు, సంస్కరణల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. సింగరేణి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి, కేంద్ర బొగ్గు శాఖ అధికారులు, సింగరేణి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం