వాస్తవ గమ్యం / తెలంగాణ / : మంచిర్యాల జిల్లా (కోటపల్లి) నేరాలనిర్మూలనమరియుప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ను ముమ్మరం చేశారు.ఇందులో భాగంగా గురువారం తెల్లవారు జామున కోటపల్లి మండలంలోని దేవులవాడ గ్రామంలో జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు నేతృత్వంలో సుమారు 50 మంది పోలీసులతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.గ్రామంలోని అనుమానాస్పద ప్రాంతాలపై దాడులు నిర్వహించిన పోలీసులు, భారీగా నిల్వ ఉంచిన సుమారు 2000 లీటర్ల బెల్లపు పానకాన్ని గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే 70 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, అక్రమ తయారీ మరియు విక్రయాలకు పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.గ్రామంలో ఇంటింటినీ తనిఖీ చేసిన పోలీసులు, సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు,5ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసిపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయంతో పాటు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త వ్యక్తులు లేదా అనుమానితుల కదలికలపై నిఘా ఉంచాలని గ్రామస్తులను సూచించారు.మహిళలు, చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆపద సమయంలో 'డయల్ 100'ను ఆశ్రయించాలని తెలిపారు.నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఆపరేషన్లో చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, రూరల్ సీఐ ఆర్.కృష్ణ, ఎస్సైలు సుబ్బారావు, రాజశేఖర్, జగదీశ్వర్ రెడ్డి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం