వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: డీసీస్ సర్వే వాలంటీర్ల పారితోషికం చెల్లింపుల్లో జాప్యంపై వాస్తవ గమ్యం తెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. పెండింగ్లో ఉన్న చెల్లింపులను విడుదల చేసి, వాలంటీర్ల బ్యాంకు ఖాతాల్లో పారితోషికాన్ని జమ చేశారు. దీంతో చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్న వాలంటీర్లు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన వాస్తవ గమ్యం తెలుగు దినపత్రికకు వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్పందించిన సంబంధిత అధికారులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం