వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, మంచిర్యాల జిల్లా భీమారం పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా భీమారం పట్టణ సమీపంలోని 63వ జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, కిరాణా దుకాణాలు, పాన్ షాపులతో పాటు అనుమానిత ప్రదేశాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.నాటుసారా, గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలు మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు భీమారం ఎస్సై రాజేందర్ తెలిపారు. అనుమానిత ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించి నార్కోటిక్ డాగ్ సహాయంతో తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ, మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండాఅప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్కు బానిసై తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచించారు.మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించి ఎక్కడైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజలు అందించే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని భీమారం పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Reporter
వాస్తవ గమ్యం