వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : జైనూర్ మండలం పవర్ గూడ 5 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని మండలంలోని పవర్ గూడ గ్రామ సర్పంచ్ తొడసం రాజేందర్ అన్నారు. శనివారం పవర్ గూడ గ్రామంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ తొడసం రాజేందర్ మాట్లాడుతూ.చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు ఎంతో ముఖ్యమని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రభుత్వం సూచించిన అన్ని వ్యాక్సిన్లను సకాలంలో వేయించాలని సూచించారు. పిల్లలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు వ్యాక్సిన్లు ఎంతగానో ఉపయోగ పడతాయని తెలిపారు.అదేవిధంగా గ్రామంలోని 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాక్సిన్ అందేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ కార్యక్రమం ద్వారా చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్తులో వ్యాధుల బారిన పడకుండా ముందస్తు రక్షణ కల్పించవచ్చని అన్నారు.ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు. గ్రామంలో ఏ చిన్నారికి కూడా వ్యాక్సిన్ మిస్ కాకుండా సంబంధిత ఆరోగ్య సిబ్బందితో కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు మరియు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం