వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో శనివారం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఈసీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి వరంగల్ జోన్-2 చీఫ్ జోనల్ ఇన్చార్జ్ దాగిళ్ల దయానందరావు ముఖ్య అతిథిగా, పెద్దపల్లి పార్లమెంట్ ఇన్చార్జ్ కాదాసి రవీందర్, వర్కిల్ల మల్లేష్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.సమావేశానికి ముందు పార్టీ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా దాగిళ్ల దయానందరావు మాట్లాడుతూ, భారతదేశ చరిత్రను తిరగరాసేది బహన్ మాయావతి అని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణతో పాటు అణగారిన వర్గాల అభివృద్ధే బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 2027లో ఉత్తరప్రదేశ్లో, 2028లో తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ మంచిర్యాల జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ జెండా ఎగురవేయాలని. పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్టం చంద్రశేఖర్ బీఎస్పీలో చేరారు. ఆయనకు దాగిళ్ల. దయానందరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించి, మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి సంతోష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిళ్ల మురళి, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జిలు గోమాస బ్రహ్మానందం, గోలేటి నారాయణ, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడు బండారి రాజ్కుమార్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎండీ మాతిన్ ఖాన్, నస్పూర్ మండల అధ్యక్షుడు వేముల కిరణ్, నాయకులు జాగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం