వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్, ఆసిఫాబాద్లో నిర్వహించిన 5వ జాతీయ జావెలిన్ డే వేడుకలు మరియు జిల్లా స్థాయి యూత్ & కిడ్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లు ఘనంగా ముగిశాయి.జిల్లా నలుమూలల నుంచి 100 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కోట్నాక్ విజయ్ కుమార్ విజేతలకు మెడల్స్ ప్రదానం చేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో ACMO ఉద్దవ్, ATDO చిరంజీవి, స్పోర్ట్స్ ఆఫీసర్ షేక్, యంగ్ ఇండియా నోడల్ ఆఫీసర్ బండ మీనారెడ్డి, కోశాధికారి మంగావతి, వైస్ ప్రెసిడెంట్లు ఆత్రం కృష్ణమూర్తి, కురుసంగ శీను, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, వ్యాయామ ఉపాధ్యాయులు రాకేష్, స్వప్న, లక్ష్మి, సునీత తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గుండం లక్ష్మణ్ మాట్లాడుతూ, ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆగస్టు 7న హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Reporter
వాస్తవ గమ్యం