Tuesday, 28 July 2026 05:30:13 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

బేర సత్యనారాయణ ఇంటి పై జరిగిన దాడిని ఖండించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు

జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్

Date : 08 July 2026 06:48 PM Views : 285

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల మండల మాజీ ఎంపీపీ, బీజేపీ నాయకుడు బేర సత్యనారాయణ నివాసంపై జరిగిన దాడిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగ్నూరి వెంకటేశ్వర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్ అనుచరులు బేర సత్యనారాయణ ఇంటిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు తలుపులు బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించి, కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ బెదిరించి భయానక వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజమేనని, అయితే వాటిని చర్చలు, విమర్శలు, ప్రెస్‌మీట్లు వంటి ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే వ్యక్తం చేయాలని అన్నారు. రౌడీయిజం, వ్యక్తిగత దాడులు, బెదిరింపుల సంస్కృతికి ప్రజాస్వామ్యంలో ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు.గతంలో కూడా మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్‌పై పలు ఆరోపణలు వచ్చాయని, అనేక మందిపై దాడులకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయని పేర్కొన్నారు. బేర సత్యనారాయణ అవినీతి, అక్రమాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నందుకే కక్షసాధింపు ధోరణితో ఈ దాడి జరిగిందని ఆరోపించారు. బేర సత్యనారాయణ కుటుంబ సభ్యుల ప్రాణాలకు పూర్తి భద్రత కల్పించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగ్నూరి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు సత్రం రమేష్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు అమరశెట్టి రాజు, కౌన్సిలర్లు బోట్ల సత్యనారాయణ, అనిత, నాగరాజు, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఆకుల అశోక్ వర్ధన్, సదానందం, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కమలాకర్ రావు, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పానుగంటి మధు, బీజేపీ రాష్ట్ర కార్యకర్త దుర్గం అశోక్, మాజీ ఎంపీటీసీ మోటపలుకుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :