వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్ అన్నారు. గురువారం మండలంలోని చిర్రకుంట గ్రామంలో సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబుతో కలిసి గ్రామ సంఘ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందినట్లయితే దేశం అభివృద్ధి చెందినట్లేనని,దేశంలోని గ్రామాల అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో చెట్లు కీలకపాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరు తమ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. అంతకుముందు చిర్రకుంట గ్రామస్తులు మంగళహారతులు,భాజా భజంత్రీలతో వీరికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరిగెల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అనిల్ లతోపాటు బిజెపి కార్యకర్తలు మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం