వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ 9వ వార్డులోని ఆర్కేపీ ఎక్స్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మారుతి పవర్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పాల్గొని జిమ్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో జిమ్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. యువత క్రీడలు, వ్యాయామంపై ఆసక్తి పెంపొందించుకుని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.అనంతరం జిమ్లో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామ పరికరాలను పరిశీలించిన మంత్రి, నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువకులు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం