వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రైతుల వద్ద నుండి వరి ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెబ్బెన మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక డిప్యూటీ ఎమ్మార్వో (డీటీ)కి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు పిలుపు మేరకు మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అనంతరం బీజేపీ నాయకులు ఈ వినతి పత్రాన్ని అందజేశారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసే సమయంలో 40 కిలోల బస్తాపై అదనంగా 5 కిలోల చొప్పున (తరుగు పేరుతో) ఎక్కువ తీసుకుంటూ రైతులకు అన్యాయం చేస్తున్నారు. కేంద్రాలలో తార్పాళ్ళు, గోన సంచుల కొరత తీవ్రంగా ఉంది. త్వరితగతిన కొనుగోళ్ళు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, ధాన్యం పాడవకుండా రైతుల వద్ద నుండి వెంటనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలి. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ధాన్యం కొనుగోలును వేగవంతం చేయకపోతే.బీజేపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు, ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి కొలిపాక కిరణ్, మండల అధ్యక్షుడు మల్రాజ్ రాంబాబు, ప్రధాన కార్యదర్శి సునార్కర్ తిరుపతి, ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్, వార్డ్ మెంబర్లు ముంజం అఖిల్, బక్క ఆనంద్, మండల కార్యదర్శి ముంజల వెంకన్నలతో పాటు రైతులు రాజు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం