Saturday, 13 June 2026 09:43:38 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

బెల్లంపల్లిలో ఘనంగా పంచముఖి శివాంజనేయ స్వామి విగ్రహ పునరుద్ధరణ: పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్

Date : 11 May 2026 04:58 PM Views : 905

Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి మండలంలోని కన్నాల ప్రాంతంలో వెలసిన శ్రీ పంచముఖి శివాంజనేయ స్వామి విగ్రహ పునరుద్ధరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కన్నాల ప్రాంతంలోని స్వామివారి విగ్రహం రంగులు వెలసిపోవడంతో, ఆగమ శాస్త్ర నిపుణుల సూచనల మేరకు పునరుద్ధరణ పనులు చేపట్టారు. పట్టణ అభివృద్ధిని కాంక్షిస్తూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శివాంజనేయ కమిటీ సభ్యులు మరియు దాతల సహకారంతో విగ్రహానికి నూతనంగా రంగులు వేయించి, ఈ పునరుద్ధరణ మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ..భక్తి భావం సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజలకు మానసిక ప్రశాంతతను, ఆత్మశాంతిని చేకూరుస్తాయి. నియోజకవర్గ ప్రజలందరిపై ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు, కన్నాల సర్పంచ్ నాతరి మల్లమ్మ, కమిటీ అధ్యక్షులు నర్సింగమ్, ఉపాధ్యక్షులు ఢీకొండ రాజలింగం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి నాతరి స్వామి, సంయుక్త కార్యదర్శి నెల్లి రమేష్, కార్యదర్శులు నూనె ప్రభాకర్, కటకం సతీష్, సాంబశివ రావు పాల్గొన్నారు.అలాగే కౌన్సిలర్లు ఢీకొండ పద్మ, నిచ్చకోల వంశీ, చింతల వసంత, నాయకులు కంకటి శ్రీనివాస్, గెల్లి రాజలింగు, నెల్లి సమ్మయ్య, సుద్దాల శ్రీనివాస్, సమ్మిరెడ్డి, ఎనగందుల సుధాకర్, తిరుపతి, రాజేష్, భూమిదాత శంకరయ్యతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :