Saturday, 12 September 2026 04:51:39 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

బెల్లంపల్లి రైల్వే కార్మికుల సమస్యలు జీ ఎం,డీ ఆర్ ఎం ల దృష్టికి తీసుకువెళ్లి పరిస్కరిస్తా

సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్

Date : 09 April 2026 07:53 PM Views : 313

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లిలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్ తెలిపారు.గురువారం పట్టణంలోని రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయం లో జరిగిన యూనియన్ బెల్లంపల్లి బ్రాంచి మొదటి బీ ఈ సీ సమావేశానికి పీ రవీందర్ ముఖ్యాతిధి గా హాజరైప్రసంగించారు.ఈ సందర్బంగా బెల్లంపల్లిలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను బ్రాంచ్ చైర్మన్ ఎస్ నాగరాజు సెక్రెటరీ జీ సాంబశివుడులు డివిజనల్ సెక్రటరీ కి విన్న వించారు. బెల్లంపల్లి లోకో పైలట్ వెయిటింగ్ హాల్ నిర్మించాలని,ఇంజనీరింగ్ పిడబ్ల్యూఐ ఆఫీసులలో మినీ వాటర్ ప్లాంట్ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు రవీందర్ ను కోరారు. అంతే కాకుండా లోకో పైలట్ లాబీ ఆర్వో ప్లాంట్ రిపేర్ చేసేలా,బెల్లంపల్లి క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పరచాలని, బెల్లంపల్లి లో రైల్వే క్వాటర్స్ బ్యాక్ సైడ్ డ్రైనేజ్ కాలువ నిమించేలా రైల్వే ఉన్నతాధికారులదృష్టికి సమస్యలు తీసుకువెళ్లాలని వారు కోరారు. బెల్లంపల్లి రైల్వే కాలనీలో రైల్వే కార్మికుల క్వార్టర్స్ ను పూర్తిస్థాయిలో మరమత్తులు చేసేలా, మంచిర్యాల పాయింట్స్ మెన్ లకు ఎనిమిది గంటల పని విధానం. అమలుపరిచేలా చూడాలని,మంచిర్యాల లో ఆర్వో ప్లాంట్ వెంటనే ఓపెన్ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డివిజనల్ సెక్రెటరీ కి సమస్యలు విన్నవించగా ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా డివిజనల్ సెక్రెటరీ బెల్లంపల్లి బ్రాంచి నాయకత్వానికి హామీ ఇచ్చారు. బెల్లంపల్లి బ్రాంచ్ లో ఉన్న అన్ని సమస్యల గురించి చర్చించడం జరిగిందన్నారు. ఈ సమావేశం లో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్యూనియన్ జోనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నవనీత్.బెల్లంపల్లి బ్రాంచ్ ట్రెజరర్ షాకింగ్ మీనా, ఇతర ఆఫీస్ బేరర్స్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ ఎంప్లాయిస్ పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :