వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : మంచిర్యాల డివిజన్ అటవీ అధికారులు అందరికీ శ్రీరాంపూర్ లోని శాంతి గ్రౌండ్లో డ్రోన్ పని చేయు విధానము, ఆపరేటింగ్ మీద ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల అటవీ మండలాధికారి సర్వేశ్వర్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో జంతువుల కదలికలను మరియు అటవీ ప్రాంతంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా డ్రోన్ సహాయంతో నిఘాను పటిష్టపరుచుటకు అటవీ అధికారులు అందరికీ డ్రోన్ ఆపరేటింగ్ నేర్పించడం జరిగింది అని తెలిపారు ఈ ట్రైనింగ్ లో మంచిర్యాల, లక్షెట్టిపేట్ మరియు దేవాపూర్ రేంజ్ లకు సంబంధించిన అటవీ అధికారులు హాజరు కావడం జరిగింది
Reporter
వాస్తవ గమ్యం