వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రామకృష్ణాపూర్ బైపాస్ రోడ్డులోని డంప్యార్డ్ నుంచి వ్యర్థాలు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంప్యార్డ్లో చెత్తను సక్రమంగా నిర్వహించి, బయటకు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.డంప్యార్డ్లో ఉండాల్సిన వ్యర్థాలు రోడ్డుపైకి ఎందుకు వస్తున్నాయి? చెత్తను సక్రమంగా నిల్వ చేసే ఏర్పాట్లు లేవా? వర్షం వచ్చిన ప్రతిసారీ వ్యర్థాలు రోడ్డుపైకి కొట్టుకురావడం అధికారుల దృష్టికి రావడం లేదా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.రోడ్డుపై చెత్త పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దుర్వాసన, అపరిశుభ్రతతో పాటు పందులు, ఇతర జంతువులు రోడ్డుపై సంచరిస్తుండటంతో ప్రమాదాల ప్రమాదం కూడా నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డంప్యార్డ్ను సక్రమంగా నిర్వహించి, వ్యర్థాలు రోడ్డుపైకి రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.
Reporter
వాస్తవ గమ్యం