Tuesday, 28 July 2026 01:09:48 PM
# కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం # 54 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం. # జైపూర్ ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం.

బిజిగిర్ షరీఫ్ దర్గా వద్ద సీసీ కెమెరాలను ప్రారంభించిన హుజురాబాద్ ఏసీపీ మాధవి

Date : 19 May 2026 08:20 PM Views : 1179

వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : స్థానిక బిజిగిర్ షరీఫ్ దర్గాలో ఈ నెల 28వ తేదీన జరగనున్న ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకొని భక్తుల భద్రతకై దర్గా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను హుజురాబాద్ ఏసీపీ మాధవి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్, గ్రామ సర్పంచ్ రాచపల్లి వనజ-రాజయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ.ఉరుసు ఉత్సవాలకు భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల రక్షణ, భద్రత దృష్ట్యా దర్గా ప్రాంగణంలో సీసీ కెమెరాల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పోలీసు శాఖ సూచన మేరకు దర్గా కమిటీ సభ్యులు తక్షణమే స్పందించి, సొంత ఖర్చులతో 10 సీసీ కెమెరాలను అమర్చడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించిన దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్‌ను ఏసీపీ శాలువాతో సత్కరించి అభినందించారు.​దర్గా కమిటీ తరఫున అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్. ఏసీపీ మాధవి, సీఐ రామకృష్ణ గౌడ్, సర్పంచ్ రాచపల్లి వనజ-రాజయ్య, వార్డు సభ్యుడు నయీముద్దీన్‌లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌఫిక్ హుస్సేన్, కమిటీ సభ్యులు సర్వర్, అలీ షరీఫ్, అజ్మత్, రెహాన్, అయాన్ మరియు గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: