Saturday, 13 June 2026 09:39:12 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

బిజిగిర్ షరీఫ్ దర్గా వద్ద సీసీ కెమెరాలను ప్రారంభించిన హుజురాబాద్ ఏసీపీ మాధవి

Date : 19 May 2026 08:20 PM Views : 1114

Vastava Gamyam - తెలంగాణ / కరీంనగర్ : స్థానిక బిజిగిర్ షరీఫ్ దర్గాలో ఈ నెల 28వ తేదీన జరగనున్న ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకొని భక్తుల భద్రతకై దర్గా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను హుజురాబాద్ ఏసీపీ మాధవి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్, గ్రామ సర్పంచ్ రాచపల్లి వనజ-రాజయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ.ఉరుసు ఉత్సవాలకు భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల రక్షణ, భద్రత దృష్ట్యా దర్గా ప్రాంగణంలో సీసీ కెమెరాల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పోలీసు శాఖ సూచన మేరకు దర్గా కమిటీ సభ్యులు తక్షణమే స్పందించి, సొంత ఖర్చులతో 10 సీసీ కెమెరాలను అమర్చడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించిన దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్‌ను ఏసీపీ శాలువాతో సత్కరించి అభినందించారు.​దర్గా కమిటీ తరఫున అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్. ఏసీపీ మాధవి, సీఐ రామకృష్ణ గౌడ్, సర్పంచ్ రాచపల్లి వనజ-రాజయ్య, వార్డు సభ్యుడు నయీముద్దీన్‌లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌఫిక్ హుస్సేన్, కమిటీ సభ్యులు సర్వర్, అలీ షరీఫ్, అజ్మత్, రెహాన్, అయాన్ మరియు గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :