Vastava Gamyam - తెలంగాణ / కరీంనగర్ : స్థానిక బిజిగిర్ షరీఫ్ దర్గాలో ఈ నెల 28వ తేదీన జరగనున్న ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకొని భక్తుల భద్రతకై దర్గా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను హుజురాబాద్ ఏసీపీ మాధవి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్, గ్రామ సర్పంచ్ రాచపల్లి వనజ-రాజయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ.ఉరుసు ఉత్సవాలకు భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల రక్షణ, భద్రత దృష్ట్యా దర్గా ప్రాంగణంలో సీసీ కెమెరాల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పోలీసు శాఖ సూచన మేరకు దర్గా కమిటీ సభ్యులు తక్షణమే స్పందించి, సొంత ఖర్చులతో 10 సీసీ కెమెరాలను అమర్చడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించిన దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ను ఏసీపీ శాలువాతో సత్కరించి అభినందించారు.దర్గా కమిటీ తరఫున అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్. ఏసీపీ మాధవి, సీఐ రామకృష్ణ గౌడ్, సర్పంచ్ రాచపల్లి వనజ-రాజయ్య, వార్డు సభ్యుడు నయీముద్దీన్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌఫిక్ హుస్సేన్, కమిటీ సభ్యులు సర్వర్, అలీ షరీఫ్, అజ్మత్, రెహాన్, అయాన్ మరియు గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam