Friday, 11 September 2026 01:45:35 PM
# జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు # మందమర్రి లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

అవార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలి జాతీయ రహదారి–63 విస్తరణ దరఖాస్తుల పరిశీలనపై కలెక్టర్‌ దృష్టి

Date : 01 September 2026 06:48 PM Views : 100

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలో జాతీయ రహదారి–63 విస్తరణ పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న అవార్డుల జారీని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియలో జాప్యం లేకుండా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా డి.ఏ.ఓ. రమేష్‌తో కలిసి జాతీయ రహదారి–63 విస్తరణకు సంబంధించి కార్యాలయంలో కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, వాటి పరిశీలన పురోగతి, పెండింగ్‌లో ఉన్న అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.జాతీయ రహదారి–63 విస్తరణ పనులు వేగంగా ముందుకు సాగేలా భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. దరఖాస్తుల పరిశీలనలో అవసరమైన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అర్హత కలిగిన కేసుల్లో అవార్డుల జారీని ఆలస్యం చేయవద్దని సూచించారు. పెండింగ్‌ దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి, సంబంధిత ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :