Saturday, 13 June 2026 09:44:25 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

కిష్టంపేట ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నేత దుర్గం అశోక్..

Date : 23 May 2026 03:13 PM Views : 806

Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : చెన్నూరు మండల పరిధిలోని కిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చెన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ కంటెస్టెడ్ అభ్యర్థి దుర్గం అశోక్ సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంపై ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏ ఓ) యామినితో ఫోన్ ద్వారా మాట్లాడి, కొనుగోళ్లలో అలసత్వాన్ని వీడి త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ... కొనుగోలు కేంద్రాలకు లారీలు రావాలంటే 5000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, అలాగే అన్ లోడింగ్ కోసం బస్తాకు రూ. 15 నుండి రూ. 20 (క్వింటాలుకు సుమారు రూ. 50) వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, తేమ పేరుతో బస్తాకు 2 నుండి 5 కిలోల వరకు తరుగు (కటింగ్) విధిస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చెన్నూరు మార్కెట్ యార్డ్ గోదాముకు వెళ్లిన ఆయన.ఎలాంటి తరుగు లేకుండా, తక్షణమే అన్ లోడింగ్ ప్రక్రియను పూర్తి చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని పై అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ చెన్నూరు మండల అధ్యక్షులు బుర్ర రాజశేఖర్ గౌడ్, 18వ వార్డు కౌన్సిలర్ ఏతం శివకృష్ణ, మాజీ పట్టణ అధ్యక్షులు జాడి తిరుపతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆలం బాపు, పట్టణ ప్రధాన కార్యదర్శి కాయిత వెంకటేష్, సీనియర్ నాయకులు యువరాజ్, రాజేశ్ చింతల తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :