వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : యూఎస్ పి సి ఆధ్వర్యంలో భీమారం ఎమ్మార్వో సదానందం కి భోజన విరామ సమయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యు.ఎస్.పి.సి నాలుగు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, సిపిఎస్ ను రద్దు చేయాలని,ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో భీమారం మండల యూఎస్ పి సి నాయకులు బొల్లంపల్లి కుమారస్వామి,నగునూరి శ్రీనివాస్,పులి వెంకటేష్,దరిపెల్లి స్వరూప, మండల ఉపాధ్యాయులు సునీత,రజిత,అనిత,ఉమ,మరియ,నవత,ఆశీర్వాద్, చారి, ఏం ఆర్ సి స్టాఫ్ ఇంతియాజ్,సాగర్ లు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం