వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) ఈరోజు డివిజనల్ డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ నాగేందర్ సందర్శించారు.ఈ సందర్భంగా వైద్యశాలలో నిర్వహిస్తున్న అన్ని రికార్డులను పరిశీలించి, ఆరోగ్య సేవల అమలు తీరును సమీక్షించారు. అలాగే ఆశా కార్యకర్తలు, వైద్యశాల సిబ్బందితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.పిల్లల్లో పోషకాహార లోపం, గర్భిణీలలో రక్తహీనత, నవజాత శిశువులకు తల్లిపాల ప్రాధాన్యత, గర్భిణీల హైరిస్క్ కేసులు, దీర్ఘకాలిక వ్యాధులు, క్షయవ్యాధి, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికున్గున్యా వంటి వర్షాకాల వ్యాధుల నివారణ చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే డ్రై డే కార్యక్రమాల నిర్వహణపై కూడా ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ, ఆర్బీఎస్కే వైద్యాధికారి డాక్టర్ కౌటిల్య, హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ శ్రీవాణి, డివిజనల్ సబ్ యూనిట్ అధికారి శ్యాంలాల్, సబ్ యూనిట్ అధికారి నైతం శ్రీనివాస్, పర్యవేక్షకురాలు రత్నమాల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ డేటా ఎంట్రీ ఆపరేటర్ శివ, పీహెచ్సీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం