వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: కాసిపేట మండలంలో యువతిపై అత్యాచారానికి యత్నించిన నిందితుడికి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు కఠిన శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడు శేఖర్కు 18 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి డ్యానీ రౌతు తీర్పు వెలువరించారు.దేవాపూర్ ఎస్సై గంగారం తెలిపిన వివరాల ప్రకారం.2022లో బాధితురాలు వాష్రూమ్కు వెళ్లేందుకు ఇంటి బయటకు వచ్చిన సమయంలో, పక్క పోర్షన్లో అద్దెకు ఉంటున్న శేఖర్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు నిందితుడికి 18 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.
Reporter
వాస్తవ గమ్యం