Saturday, 12 September 2026 04:34:44 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

లారీ బొలెరో డి ఇద్దరికీ తీవ్ర గాయాలు

Date : 20 August 2026 09:27 PM Views : 136

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రెబ్బెన : మండలం లోని కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌, ఇందిరానగర్‌ మధ్యలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కౌటాల మండలం వీర్ణండి గ్రామానికి చెందిన జాడి ప్రదీప్‌, జాడి మహేష్‌లు బొలెరో వాహనంలో ఇంటి సామానును తీసుకుని మంచిర్యాల వైపు వెళుతున్నారు. అదే సమయంలో ఆసిఫాబాద్‌ వైపు నుంచి రెబ్బెన వైపు ఐరన్‌ పైపుల లోడ్‌తో వెళుతున్న లారీని బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో లారీ రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బోల్తాపడగా, బొలెరో వాహనం రోడ్డుపైనే బోల్తాపడింది.వెంటనే స్థానికులు రెబ్బెన పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై వెంకటకృష్ణ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.రోడ్డుపై బోల్తాపడి ఉన్న వాహనాన్ని వెంటనే స్థానికులు పైకి లేపి మహేష్‌ను బయటకు తీశారు. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో వాహనం నడుపుతున్న ప్రదీప్‌ కాళ్లు క్యాబిన్‌లో ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయాడు. దాంతో స్థానికులు తాడు సహాయంతో బొలెరో డోర్‌, క్యాబిన్‌ను బయటకు లాగి అతికష్టం మీద ప్రదీప్‌ను బయటకు తీశారు.వెంటనే ఇద్దరినీ బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ప్రదీప్‌కు రెండు కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు కాగా, మహేష్‌కు స్వల్పగాయాలయ్యాయి.అయితే రెండు వాహనాలు ఒకే మార్గంలో ప్రయాణిస్తూ ఎదురెదురుగా ఢీకొనే అవకాశం ఏమాత్రం ఉండదు. కానీ బొలెరో, లారీని ఎదురుగా ఢీకొట్టడాన్ని చూస్తే బొలెరో వాహనం రాంగ్‌రూట్‌లో కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వైపు వెళుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడం మూలంగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: