వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ గౌరవాధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్ హెచ్చరించారు.తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాల వివరాలను ఆయన వెల్లడించారు.ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న ఈ ఆందోళనకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల కార్మిక విప్లవ సంఘాలు, ఆటో కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.అనంతరం 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దిగ్బంధం చేపట్టి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని. పేర్కొన్నారు.అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే 25వ తేదీన ‘చలో హైదరాబాద్–చలో ప్రజాభవన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గాజుల ముఖేష్ గౌడ్ స్పష్టం చేశారు.పేద,మధ్యతరగతి ఆటో కార్మికుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో వివిధ ఆటో సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం