వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని 22వ బూత్ బీఎల్ఓ పౌడాల రజితకు ఉత్తమ సేవలకుగాను రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రశంసా బహుమతి అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీలోగా ప్రతి బీఎల్ఓ తమ పరిధిలోని ప్రతి ఓటరితో ఎన్యూమరేషన్ ఫారమ్ను పూర్తిగా నింపించి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఒక్క ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.అలాగే, కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు కూడా 22వ బూత్ను ఆదర్శంగా తీసుకుని, ఎక్కువ మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారమ్లను ఆన్లైన్లో నమోదు చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 22వ బూత్ బీఎల్ఓ పౌడాల రజిత సేవలను మంత్రి అభినందిస్తూ, అదే స్ఫూర్తితో మిగతా బీఎల్ఓలు, బీఎల్ఏలు పనిచేసి ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ నర్సింగ్, పట్టణ అధికార ప్రతినిధి, 22వ బూత్ బీఎల్ఏ సట్ల సంతోష్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షుడు రాచర్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం