వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భీమారం మండల కేంద్రంలో జనవాసాల్లోకి వచ్చిన చుక్కల దుప్పిని ఫారెస్ట్ అధికారులు పట్టుకొని సురక్షితంగా అడవిలో వదిలేశారు. బుధవారం ఉదయం కుక్కలు వెంటాడగా అడవిలో నుంచి వచ్చిన ఒక చుక్కల దుప్పి బీసీ బాయ్స్ హాస్టల్ లోకి వెళ్ళింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు జి . బానేష్, బి శ్రీకాంత్ ఎఫ్బి ఓ లు అక్కడికి చేరుకొని, గ్రామస్థుల సహాయం తో చుక్కల దుప్పి ని పట్టుకొని, క్షేమంగా అడవి లో వదిలి పెట్టారు..
Reporter
వాస్తవ గమ్యం