వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు ఆవుల సాగర్, పిట్టల సుధాకర్ ఆధ్వర్యంలో భారీగా చేరికల కార్యక్రమం జరిగింది. పెద్దపల్లి, ఆదిలాబాద్ కో-ఆర్డినేటర్ చుంచు రాజకిరణ్, పెద్దపల్లి కో-ఆర్డినేటర్ మంథని సంపత్ సమక్షంలో మందమర్రి ప్రాంతానికి చెందిన రాసమల్ల రాజేష్తో పాటు దాదాపు 50 మంది యువకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. నూతనంగా పార్టీలోకి చేరిన వారికి నేతలు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా చుంచు రాజకిరణ్ మాట్లాడుతూ.జనసేన పార్టీ ఎల్లప్పుడూ యువతకే అగ్రతాంబూలం ఇస్తుందని స్పష్టం చేశారు. రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పార్టీ సర్వసన్నద్ధంగా ఉందని, ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే శక్తి జనసేనకు మాత్రమే ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో:ముఖ్య నేతలు: జిల్లా నాయకులు నల్లతిగల మహేష్, ఆవునూరి రమేష్, మల్లంపెల్లి విష్ణు, చరణ్ తదితరులు పాల్గొన్నారు.పార్టీలో చేరిన ప్రముఖులు: మర్రి శ్రవణ్, మర్రి కృష్ణ, కళ్యాణ్, కుమ్మరి సూర్యచంద్ర, వినోద్, వైష్ణవ తదితర యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
Admin
వాస్తవ గమ్యం