Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : అభివృద్ధి పేరుతో ఆదివాసీల పోడు పట్టా భూములను తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు అప్పగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (TAGS) జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం మండిపడ్డారు. కోటపల్లి మండలం అర్జునగుట్ట గ్రామంలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి..ఇక్కడ ఎవరూ పోడు వ్యవసాయం చేయడం లేదు, ఎవరికీ పట్టాలు లేవు, హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోలేదు. అంటూ అటవీ, రెవెన్యూ అధికారులు తప్పుడు తీర్మాన పత్రాలు సృష్టించారని ఆయన ఆరోపించారు. ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా, ఆఫీసుల్లో కూర్చుని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆదివాసీలను ముంచడమేనని.. ఒకవేళ ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసనలో మాజీ జెడ్పీటీసీ వేలాది సమ్మయ్య, ఉప సర్పంచ్ కుర్సింగ సమ్మయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam