Vastava Gamyam - తెలంగాణ / : కుమురంభీం జిల్లా పెంచికల్పేట్ మండలం దరోగపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో విధుల్లో నిర్లక్ష్యం బయటపడింది. ఉదయం 11:10 గంటలకు సర్పంచ్ బొట్టుపెల్లి కృష్ణవేణి పరిశీలనకు వెళ్లగా, టీచర్ అందుబాటులో లేకుండా కేంద్రంలో ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం, ఆ సమయంలో టీచర్ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలిసింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు లేకపోవడం పట్ల సర్పంచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.అంగన్వాడీ కేంద్రాలు చిన్నపిల్లలకు పోషకాహారం, ప్రాథమిక విద్య అందించాల్సిన కీలక కేంద్రాలుగా ఉండగా, ఈ తరహా నిర్లక్ష్యం పిల్లల అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు.
Admin
Vastava Gamyam