వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీలో మంగళవారం 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా వైద్య ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే డిహైడ్రేషన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకమవుతుందని హెచ్చరించారు. బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కోరుతూ.. 14 ఏళ్లు నిండిన వారికి గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ ఇప్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయుష్ ఆధ్వర్యంలో యోగా, ధ్యానం యొక్క విశిష్టతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ వీటిని జీవనశైలిలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా. ముస్తాఫా, డా. సింధూర, డా. పద్మజ, సీహెచ్ఓ రాజిరెడ్డితో పాటు పవర్ ప్లాంట్ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం