Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో సాగుతున్న అమృత్ 2.0 అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి రమేష్ బాబు, జిల్లా అదనపు కలెక్టర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) చంద్రయ్య శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఈ తనిఖీ చేపట్టారు. పనుల పురోగతిని పరిశీలించిన అధికారులు, రాబోయే నాలుగు నెలల్లో పనులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఫిల్టర్ బెడ్ పరిశీలన: కన్నాల పనులతో పాటు రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఫిల్టర్ బెడ్ను కూడా అధికారులు పరిశీలించి, అధికారులకు తగిన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam