వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని ప్రముఖ శ్రీ హరిహర దేవస్థానంలో పవిత్ర శ్రావణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ సంతోషి మాత పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది.శుక్రవారం ఉదయం అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ సంతోషి మాతకు విశేష పంచామృతాభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. అనంతరం మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం సమర్పించి, కుంకుమార్చనలు, దీపారాధనలు నిర్వహించారు.శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో స్థానిక భక్తులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో హరిహర దేవస్థాన ‘జై సంతోషి మాత’ నామస్మరణతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, పూజా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. మాతా స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు.
Admin
వాస్తవ గమ్యం