వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలని మేయర్, కమిషనర్ బీఎల్వోలు, బీఎల్ఏలకు ఆదేశించారు. బుధవారం నగరంలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను వారు స్వయంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనులను సమీక్షించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అర్హులైన ఒక్కరూ జాబితా నుంచి మిగిలిపోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించడం, కొత్త ఓటర్ల నమోదు, అవసరమైన సవరణలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆన్లైన్ నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించి, డిజిటల్ సేవలను విస్తృతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్డెస్క్ల ద్వారా వెంటనే నివృత్తి చేసి, ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోపు ప్రక్రియను పూర్తి చేయాలని మేయర్ పిలుపునిచ్చారు.
Reporter
వాస్తవ గమ్యం