Tuesday, 28 July 2026 05:36:30 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

సార్ ప్రక్రియ వేగవంతం చేయాలి

Date : 08 July 2026 03:58 PM Views : 207

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలని మేయర్, కమిషనర్ బీఎల్వోలు, బీఎల్ఏలకు ఆదేశించారు. బుధవారం నగరంలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను వారు స్వయంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనులను సమీక్షించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అర్హులైన ఒక్కరూ జాబితా నుంచి మిగిలిపోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించడం, కొత్త ఓటర్ల నమోదు, అవసరమైన సవరణలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించి, డిజిటల్ సేవలను విస్తృతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్‌డెస్క్‌ల ద్వారా వెంటనే నివృత్తి చేసి, ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోపు ప్రక్రియను పూర్తి చేయాలని మేయర్ పిలుపునిచ్చారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :