Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కెరమెరి మండలంలోని కల్లేగాం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ, గ్రామసభ చేపట్టి విద్య ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏసీఎంఓ ఉద్ధవ్ మాట్లాడుతూ బడి వయస్సు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. చదువుకు దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి తిరిగి బడిలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఉన్నత విద్యలో చేరాలని, ఈ నెల 12న ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులు తొలి రోజే హాజరు కావాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam