వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలంలోని ఇందారం గని లో మంగళవారం మైనింగ్ సూపర్వైజర్ పై దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించిన ఇంజనీర్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు ప్రాజెక్టు మేనేజర్ కి వినతిపత్రం అందజేశారు.భూగర్భ గనిలో విధులు నిర్వహిస్తున్నసూపర్వైజర్ పై అకారణంగా. దుర్భాషలాడుతూ,అసభ్య పదజాలంతో అనుచితంగా వ్యవహరించిన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ,ఇకమీదట ఏ ఒక్క కార్మికుడి తో కూడ ఇలా ప్రవర్తించకుండా బుద్ధి చెప్పాలని ఇందారం గని లో మైనింగ్ స్టాఫ్ సభ్యులు,ఇతర ఉద్యోగులు కలిసి నిరసన వ్యక్తం చేసి గ్రూప్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.నాగన్న కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో మైనింగ్ స్టాఫ్ సభ్యులు అన్వేష్ రెడ్ది,రమణ కుమార్,చుంచు వెంకటేష్,శెట్టి శంకరయ్య,తోట వేణు,శ్రీనివాస్,బద్రి ప్రవీణ్,రవీందర్,నరేష్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం